నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 1: గద్దెనెక్కిన వెంటనే లక్ష ఉద్యోగాలతో జాబ్ క్యా లెండర్ ప్రకటించి, వంద రోజుల్లోనే నెరవేరుస్తామని చెప్పిన కాంగ్రెస్.. అధికారం చేపట్టి ఏడు నెలలు కావస్తున్నా జాబ్ క్యాలెండర్ ప్ర కటించలేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన తెలిపారు.
ఇక్కడ బీఆర్ఎస్వీ కన్వీనర్ గడ్డం భరత్బాబు మాట్లాడుతూ గ్రూప్-1 మెయిన్స్కు 1:100 ప్రకారం ఎంపిక చేయాలని, గ్రూప్-2లో 2 వేలు, గ్రూప్-3లో 3 వే ల పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. ఉ స్మానియా జేఏసీ నేత మోతీలాల్ నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం చలించడం లేదని మండిపడ్డారు. గ్రూప్-1, గ్రూపు-2, డీఎస్సీ పోస్టులు పెంచి ప్రిపరేషన్కు గడువు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు నిరసన తెలిపారు. మోతీలాల్కు మద్దతుగా గ్రంథాలయం నుంచి మెట్టుగడ్డ వరకు ర్యాలీ తీశారు.
డీఎస్సీ వాయిదా వే యాలని, పోస్టులు పెంచాలని డిమాండ్ చే స్తూ హనుమకొండలోని కేంద్ర గ్రంథాలయం ఎదుట ఆందోళన చేశారు. నల్లగొండలో మం త్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ముట్టడించారు. మండల సమావేశానికి హాజరై వెళ్తుండగా మంత్రిని నిరుద్యోగులు అడ్డుకున్నారు. నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో అ క్కడి నుంచి మంత్రి జారుకున్నారు. నల్లగొం డ జిల్లా కేంద్ర గ్రంథాలయం, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని హెడ్ పోస్టాఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. నిరుద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు చింత వెంకన్న మాట్లాడుతూ డీఎస్సీని డిసెంబర్ దాకా వాయిదా వేయాలన్నారు.