జనగామ, జూలై 4 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్బండ్పై ఏర్పాటు చేయించి, ఏప్రిల్ 3న అధికారికంగా ఆయన జయంతి నిర్వహిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
గురువారం జనగామ జిల్లా కేంద్రంలోని కల్లెంరోడ్డు జంక్షన్ వద్ద దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, పాశం యాదగిరి, విమలక్కతో కలిసి ఆవిష్కరించారు. కురుమ సంఘం అధ్యక్షుడు కం చ రాములు అధ్యక్షతన జరిగిన కొమురయ్య 78వ వర్ధంతి సభలో మంత్రి మాట్లాడారు. జనగామలో స్మారక భవన నిర్మాణం కోసం 2 ఎకరాలు కేటాయిస్తామని తెలిపారు.