హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపులను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ స్పష్టంచేశారు. స్పీకర్ హోదాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా తన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి విజిటర్గా వచ్చి దానం నాగేందర్పై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారని, త్వరలోనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇటీవల జరుగుతున్న పార్టీ ఫిరాయింపులను ఎలా చూస్తారు అని ప్రశ్నించగా.. ‘పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తా. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును బట్టి ఓ పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఆ వ్యక్తి ఆ పార్టీకే అండగా ఉండాలని భావించే వ్యక్తిని నేను.
స్పీకర్ హోదాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా నా ప్రయత్నం ఉం టది’ అని చెప్పారు. అలాగే బీఆర్ఎస్ నుంచి ఫిర్యా దు చేస్తే రాజ్యాంగబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటానని తెలిపారు. ఈ అంశంలో స్థానిక కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలను పాటిస్తానని అన్నారు. బీఆర్ఎస్ నుంచి ఇప్పటివరకు తనకు ఎలాంటి ఫిర్యా దు అందలేదని చెప్పారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ప్రొటోకాల్ పాటించకుండా, అపాయింట్మెంట్ లేకుండా విజిటర్స్ మధ్యలో నుంచి వచ్చి దానం నాగేందర్పై చర్యలకు వినతిపత్రం ఇచ్చారని పేర్కొన్నారు.
ఆ వినతిని కార్యదర్శికి పంపించానని, త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. తన పరిధిలో ఉన్న వాటిని తప్పకుండా ప్రజాస్వామ్య బద్ధం గా పరిష్కరిస్తానని చెప్పారు. స్పీకర్ హోదా తగ్గకుం డా ప్రవర్తిస్తానని, తనపై సీఎం నుంచి ఎలాంటి ఆంక్ష లు లేవని, పూర్తి స్వతంత్రంగా పనిచేస్తున్నానని తెలిపారు. బీఆర్ఎస్కు చెందిన పలువురు శాసనసభ్యులు ఇటీవల కాంగ్రెస్లో చేరుతున్న నేపథ్యంలో స్పీకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.