Janmabhoomi Express | తెలుగు ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు చెప్పింది. విశాఖపట్నం-లింగంపల్లి (12805), లింగంపల్లి-విశాఖపట్నం (12806) మధ్య జన్మభూమి ఎక్స్ప్రెస్ను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. విజయవాడ డివిజన్లో ఆధునికీకరణ పనుల నేపథ్యంలో రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైలును తాత్కాలికంగా రద్దు చేశారు. నిడదవోలు-కడియం సెక్షన్ మధ్య ఆధునికీకరణ పనులు నేపథ్యంలో జూన్ 23 నుంచి ఆగస్టు 11 వరకు జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్ తదితర ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసిన విషయం విధితమే.
అయితే, ఈ నిర్ణయంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేయగా.. స్పందించిన అధికారులు రైలును పునరుద్ధరించాలని నిర్ణయించారు. జన్మభూమి ఎక్స్ప్రెస్ను ఈ నెల 25 నుంచి మళ్లీ యథావిధిగా నడిపించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రైలుతో పాటు కాకినాడపోర్ట్-చెంగల్పట్టు (17643), చెంగల్పట్టు-కాకినాడపోర్ట్ (17644) మధ్య రైళ్లను సైతం పునరుద్ధరిస్తున్నట్లు వివరించింది.