SCR Special Trains | రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లను మరో రెండునెలల పొడిగించింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆయా రైళ్లను పొడిగిస్తున్నట్లు తెలిసింది. తిరుపతి-అకోల (07605), అకోల-తిరుపతి (07606), పూర్ణ-తిరుపతి (07609), తిరుపతి – పూర్ణ (07610), హైదరాబాద్ – నర్సాపూర్ (07631), నర్సాపూర్ – హైదరాబాద్ (07632) రైళ్లను పొడిగించినట్లు పేర్కొంది. అలాగే, తిరుపతి – సికింద్రాబాద్ (07481), సికింద్రాబాద్ – తిరుపతి (07482), కాకినాడ టౌన్ – లింగంపల్లి (07445), లింగంపల్లి – కాకినాడ (07446) రైళ్లను అక్టోబర్ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఆయా రైళ్ల సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణిలను కోరింది.