Special Train | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తిరుపతి – హిసార్ మధ్య ప్రత్యేక రైలును నడిపిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 6వ తేదీ నుంచి సెప్టెంబర్ ప్రత్యేక రైలు ఇరుమార్గాల్లో నడుస్తుందని తెలిపింది. హిసార్-తిరుపతి (04717) రైలు ఈ నెల 6 నుంచి సెప్టెంబర్ 28 వరకు ప్రతి శనివారం నడుస్తుందని చెప్పింది. తిరుపతి – హిసార్ రైలు ఈ నెల 8 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ రైలు గూడూరు, నెల్లూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాగజ్నగర్, బల్లార్షా, నాగర్పూర్, ఇటార్సీ, భోపాల్, సంత్ హిర్దామ్నగర్, షుజాల్పూర్, ఉజ్జయిని, నగ్ద, రాంగంజ్మండి, కోటా, సవాయి మాధోపూర్, దుర్గాపూర్, జైపూర్, దహర్ కా బాలాజీ, సికార్, నావాల్గఢ్, ఝుంఝూను, చిరావా, లాహోరు, సాదుల్పూర్ స్టేషన్లలో ఆగుతుందని వివరించింది.