Snippers Detection | వారాంతం కావడంతో హైదరాబాద్ నగర పోలీసులు పబ్లపై ఫోకస్ పెట్టారు. ఆదివారం సాయంత్రం నగరంలోని పలు పబ్లపై అకస్మిక తనిఖీలు చేపట్టారు. పబ్స్ల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు విన వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నార్కొటిక్ బ్యూరో పోలీసుల శిక్షణ పొందిన స్నిప్పర్ డాగ్స్ సాయంతో తనిఖీలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చాలని రాష్ట్ర పోలీసులకు సీఎం ఏ రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ప్లాన్ రూపొందించుకున్న పోలీసులు తగు కార్యాచరణ చేపట్టినట్లు సమాచారం.
శనివారం రాత్రి కూడా స్నిప్పర్ డాగ్స్తో పోలీసులు పబ్ల్లో తనిఖీ చేశారు. ప్రత్యేకించి బంజారా హిల్స్, జుబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్ల పరిధిలో తనిఖీలు నిర్వహించారు. మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ అకాడమీలో ఎనిమిది నెలలుగా స్నిప్పర్ డాగ్స్కు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టీఎస్ఎన్ఏబీ) పోలీసులు శిక్షణ ఇచ్చారు. ఇల్లుజియాన్ క్లబ్ సహా పలు పబ్ల్లో తనిఖీలు చేపట్టారు. డ్రగ్స్ వాడినా, డ్రగ్స్ గ్యాంబ్లింగ్, ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని సీనియర్ పోలీసు అధికారులు హెచ్చరించారు. డ్రగ్స్ కు వ్యసనపరులుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతను హెచ్చరించారు.
Oppo Reno 12F 5G | ఒప్పో ప్రీమియం ఫోన్ ఒప్పో రెనో 12ఎఫ్ 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
World Bank | గ్రీన్ ఎనర్జీ కోసం భారత్కు ప్రపంచ బ్యాంకు 150 కోట్ల డాలర్ల రుణం..!