హైదరాబాద్: అధికార కాంగ్రెస్లోకి (Congress) వలసలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గురువారం అర్ధరాత్రి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. ఎమ్మెల్సీలు భాను ప్రసాద్, సారయ్య, దండె విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్లకు పార్టీ రాష్ట్ర దీపాదాస్ మున్షీ కాంగ్రెస్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో శాసన మండలిలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 12కు చేరింది.
ఇటీవల శాసనసభ మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటివరకు భారాస నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరినట్లు అయింది.
ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డిని చేర్చుకోవద్దు..
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఈనెల 6 లేదా.. 9వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న ప్రచారం సామాజిక మాధ్యమాలలో జోరందుకున్నది. ఎమ్మెల్యే పార్టీ మారొద్దని జడ్పీచైర్పర్సన్ సరిత వర్గం నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. గురువారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. గంటల తరబడి ట్రాఫిక్కు అంతరాయం అయింది.
ఎమ్మెల్యే ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దని కాంగ్రెస్ కార్యకర్త ప్రసాద్ సెల్ టవర్పైకి ఎక్కి నిరసన తెలిపాడు. ఆయన్ను పార్టీలోకి తీసుకుంటే టవర్ పైనుంచి దూకేస్తానని హెచ్చరించాడు. ఏఎస్సీ గుణశేఖర్, డీఎస్పీ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని అతడికి నచ్చజెప్పారు. కొద్దిసేపటి తర్వాత కిందికిరాగా దవాఖానకు తరలించారు. అనంతపురానికి చెంది న రహీం, గద్వాలకు చెందిన అనిల్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించా రు.
పోలీసులు, అక్కడున్న నాయకులు అప్రమత్తమై అడ్డుకున్నారు. ధరూర్లోనూ డీఆర్ శ్రీధర్ ఆధ్వర్యంలో మాజీ పీఏసీసీఎస్ చైర్మన్ వెంకట్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, ఆంజనేయులు, సూరితోపాటు పలువురు కార్యకర్తలు నిరసన చేపట్టారు. మండల ప్రజాపరిషత్ కార్యాల యం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు. కేటీదొడ్డిలోనూ నాయకులు ఆనంద్గౌడ్, శ్రీను, విష్ణు, గోవర్దన్, వేషాద్రి, మునెప్ప నాయక్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.