KTR | హైదరాబాద్, జూన్ 27(నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లా కరువును శాశ్వతంగా పారదోలేందుకు ఉద్దేశించిన సీతారామ ప్రాజెక్టు ప్రారంభంతో కేసీఆర్ మహాసంకల్పం నెరవేరిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సీతారామ ప్రాజ క్టు నా గుండెకాయ అని ఆనాడే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారని ఎక్స్వేదికగా గుర్తుచేశారు. ‘మరో స్వప్నం సాకారమైన క్షణమిది..కేసీఆర్ మహాసంకల్పం నెరవేరిన రోజు ఇది..!’ అని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులను కేసీఆర్ పరుగులు పెట్టించారని, పటిష్ట ప్రణాళికలను యుద్ధప్రాతిపదికన అమలు చేశారని గుర్తుచేశారు.
సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 10 లక్షల ఎకరాల్లో పచ్చని పంటలకు బంగారు బాటలు వేశారని చెప్పారు. ఖమ్మంలోని ప్రతి ఇంచు కు ఇక ఢోకా లేదని, దశాబ్దాలపాటు దగాపడ్డ రైతుకు ఇక చింత లేదని అన్నారు. కాలమై నా, కాకపోయినా.. పరవళ్లు తొకుతున్న గోదావరి జలాలతో ఖమ్మం రైతుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నిండుతాయని తె లిపారు. కేసీఆర్ కలను సాకారం చేయడం ద్వారా ఈ ‘జలవిజయం’లో భాగస్వాములై న నీటిపారుదల అధికారులు, సిబ్బందికి అ భినందనలు. కష్టపడిన ప్రతిఒకరికీ హృదయపూర్వక కృతజ్ఞతలని పేర్కొన్నారు.
వార్షిక ప్రగతి నివేదికలను విడుదల చేసే సాంప్రదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. ఆయా శాఖల వారీగా ప్రభుత్వం సాధించిన విజయాలను రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న విడుదల చేయడం సాంప్రదాయంగా వస్తున్నదని, రేవంత్రెడ్డి ప్రభు త్వం సాంప్రదాయాన్ని తుంగలో తొక్కిందని కేటీఆర్ పేర్కొన్నారు.