హైదరాబాద్ : గత కేసీఆర్(KCR) ప్రభుత్వంలో 17 వేల కోట్ల అంచనాతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు(Sitarama Project) మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్( Motors Trail Run Success) అయింది. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ట్రయల్రన్లో పాల్గొని అధికారులతో కలసి పంప్ హౌస్ మోటార్ల పనితీరును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) పరిశీలించారు. ట్రయల్ రన్ విజయవంతం కావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
పంప్హౌస్ వద్ద గోదావరికి మంత్రి పూజలు చేశారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులను అభింనందించారు. ఈ ప్రాజెక్ట్తో ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనున్నది. కాగా, సీతారామ ప్రాజెక్టు నా గుండెకాయలాంటిదని గతంలోనే కేసీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే. అంతేకాదు చెప్పినట్లుగానే ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేసే ప్రయత్నం చేశారు. సీతారామ పనులు కేసీఆర్ హయాంలోనే 70శాతం పనులు పూర్తయ్యాయి.
సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయిల్ రన్ సక్సెస్
గత కేసీఆర్ ప్రభుత్వంలో 17 వేల కోట్ల అంచనాతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయిల్ రన్ సక్సెస్.
ఉమ్మడి ఖమ్మం మరియు మహబూబాబాద్ జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు అందనున్న సాగు నీరు. pic.twitter.com/17hZknSBMO
— Telugu Scribe (@TeluguScribe) June 27, 2024