హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పోలీసుల ప్రాణాలకే రక్షణ లేకుండా పోయిందని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ను బుధవారం హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ మా ట్లాడుతూ.. రాష్ట్రంలో హోంమంత్రి లేడని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పాలనపై ఇంట్రెస్ట్ లేదని పేర్కొన్నారు.
పోలీసుల ప్రాణాలకే రక్షణ లేకపోతే, ఇక ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. దళిత ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్పై కేస్ డైరీ విసిరేసి సీఐ జితేందర్రెడ్డి తీవ్రంగా వేధించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరమన్నారు. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా ఏ ఒక్కరూ శ్రీనివాస్ను పరామర్శించకపోవడం దారుణమని పేర్కొన్నారు.