హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా నిర్ధేశించుకున్న 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు రోజుకు 2లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తిచేసి, రవాణా చేయాలని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం అధికారులను ఆదేశించారు.
రోజుకు 13 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ (మట్టి)ని తొలగించాలన్నారు. మంగళవారం సింగరేణి భవన్ నుంచి సంస్థ డైరెక్టర్లు, ఏరియా జీఎంలతో కలిసి బొగ్గు ఉత్పత్తి, నూతన ప్రాజెక్టులు, అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ వంటి అంశాలపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.