హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): మా గూడెంలో మా రాజ్యం. మా తండాలో మా పాలన కావాలని దశాబ్దాలుగా ఉద్యమించిన గిరిజన బిడ్డల కల స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సాకారంచేశారు. ఫలితంగా 3,146 ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో లంబాడి తండాలు.. కోయ, గోండుగూడేలు గ్రామపంచాయతీలుగా ఏర్పడి తమ ప్రాంతాల్లో తమ పాలన సాగిస్తున్నారు. సంక్షేమరంగంపై చర్చ సందర్భంగా ప్రభుత్వం 7 ఏండ్లలో చేపట్టిన కార్యక్రమాల వివరాలను అసెంబ్లీలో సభ్యులకు అందజేశారు.