హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన మంగళవారం రిలీవ్ అయ్యారు. ఐఏఎస్ల బదిలీల్లో ఆమెను ప్రభుత్వం బదిలీచేసి సాంకేతిక విద్యాశాఖ, కళాశాల విద్యాశాఖ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చింది. అయితే టీచర్ల బదిలీలు, పదోన్నతులు కొనసాగుతుండటంతో ఈ ప్రక్రియకు ఆటంకం కలగకుండా కొద్దిరోజులపాటు కొనసాగాలని ప్రభుత్వం సూచించింది.
టీచర్ల బదిలీలు, పదోన్నతులు పూర్తిచేసి, మంగళవారం ఆయా బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్, సమగ్రశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్గా నియమితులైన ఈవీ నర్సింహారెడ్డి బుధవారం కమిషనర్గా బాధ్యతలు స్వీకరిస్తారు. శ్రీదేవసేన సైతం బుధవారమే సాంకేతిక, కళాశాల విద్యాశాఖ కమిషనర్గా బాధ్యతలు స్వీకరిస్తారు.