హైదరాబాద్: హైదరాబాద్లో నానాటికి నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు నగరంలోని ఏదో ఒక మూల హత్యో లేదా చోరీలో చోటుచేసుకుంటున్నాయి. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడలోని శ్రీనివాసనగర్ కాలనీలో ఉన్న హనుమాన్ గుడిలో (Hanuman Temple) చోరీ జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 1.50 గంటలకు ఆలయంలోకి ప్రవేశించిన దుండగుడు హుండీని కొల్లగొట్టాడు. కట్టర్ సహాయంతో హుండీని పగలగొట్టిన గుర్తుతెలియని వ్యక్తి అందులో ఉన్న నగదు ఎత్తుకెళ్లాడు.
తొలుత హుండీ తాళం తీయడానికి యత్నించిన దొంగ.. అది రాకపోవడంతో కట్టర్ సహాయంతో దానిని పగలగొట్టాడు. అయితే హుండీ ఎదురుగా కెమెరా ఉన్న విషయాన్ని గమనించిన దుండగుడు మోహాం కనిపించకుండా మఫ్లర్ కట్టుకున్నాడు. కాగా, ఉదయాన్నే ఆలయానికి వచ్చిన సిబ్బంది పోలీసుకు సమాచారం అందించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇదంతా కెమెరాలో రికార్డయింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్.. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంధంగూడలోని శ్రీ నివాస నగర్ కాలనీలో ఉన్న
హనుమాన్ గుడిలో చోరీనిన్న రాత్రి 2.30 గంటల సమయంలో చోరీ.. కటర్ సహాయంతో హుండీ పగులగొట్టిన దొంగల.
టెంపుల్ అవరణలో ఉన్న సీసీటీవీలో రికార్డు అయిన చోరీ దృశ్యాలు. pic.twitter.com/xq6ZCU3FSe
— Telugu Scribe (@TeluguScribe) June 28, 2024