హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : పాస్పోర్ట్.. ఇది మన జాతీయతను నిర్ధారించే గుర్తింపు పత్రం. వి ద్య, ఉద్యోగం, వ్యాపారం, విహారం, వైద్యం తదితరాల కోసం అనేక మంది విదేశాలకు వెళ్తుంటారు. ఏటా వీరి సంఖ్య పెరుగుతూనే ఉన్నది. అలాంటి వారికి పాస్పోర్ట్ అనేది అ నివార్యం. ఈ క్రమంలో డిమాండ్ను దృష్టి లో పెట్టుకొని హైదరాబాద్ రీజినల్ పాస్పో ర్ట్ అధికారులు పాస్పోర్టుల జారీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.
ఆర్పీవో జొన్నలగడ్డ స్నేహజ నేతృత్వంలో ప్రజా ఫి ర్యాదుల పరిష్కార వ్యవస్థ ఏర్పాటు చేసి దరఖాస్తుదారుల సమస్యలకు పరిష్కారం చూ పుతూనే పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రాల్లో సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో స్లాట్ బుకింగ్ కోసం 25 రోజుల దాకా సమయం పట్టేది. ఇప్పుడు కేవలం 18 రోజుల్లోనే స్లాట్స్ లభిస్తుండటం విశేషం. అనేక మందికి నిరీక్షణ ఇబ్బందుల్లేకుండా త త్కాల్ అడ్జస్ట్మెంట్స్, నార్మల్ స్లాట్స్ పెంచ డం తదితర వాటితో సేవలు త్వరగా పూర్తి చేస్తున్నారు. దీనికి గానూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి హైదరాబాద్ ఆర్పీవో కు ప్రశంసలు సైతం దక్కాయి. ఈ సందర్భం గా పాస్పోర్ట్ సేవలపై రీజనల్ పాస్పోర్ట్ అధికారి జొన్నలగడ్డ స్నేహజ ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
రోజుకు 4వేల దరఖాస్తులు వస్తున్నాయి. ఇందులో పాస్పోర్ట్కు సంబంధించనవి 3,500 దాకా ఉంటాయి. మిగిలినవి పీసీసీ, రీఇష్యూకు సంబంధించనవి ఉంటున్నాయి. కొన్ని దేశాలు పీసీసీ (పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్) ప్రత్యేకంగా ఉండాల్సిందేననే నిబంధనలు పెడుతాయి. కంట్రీ స్పెసిఫిక్, పర్పస్ స్పెసిఫిక్గా పీసీపీ జారీ చేస్తాం. దీని గడువు 6 నెలలు మాత్రమే ఉంటుంది. ఈ ప్రక్రియ లో కూడా వేగం పెంచాం. చాలా మంది త త్కాల్ అవసరం లేకున్నా దరఖాస్తు చేస్తున్నా రు. సరైన డాక్యుమెంట్లు చూపలేకపోతున్నా రు. దీనిపై అవగాహన కల్పిస్తున్నాం. పాస్పోర్టు వెబ్సైట్లో నిబంధనలు చదివాకే దరఖాస్తు చేసుకోవాలి.
కొందరు తమ పాస్పోర్ట్లో చిన్నచిన్న త ప్పిదాలు వచ్చాయంటూ కార్యాలయానికి ఫి ర్యాదు చేస్తుంటారు. వాళ్లు పాస్పోర్టు ప్రక్రియలో ఏమరుపాటుతో తప్పుడు వివరాలు నమోదు చేస్తారు. పాస్పోర్ట్ జారీ అయ్యాక బాధపడుతుంటారు. అలాంటి వారికి తిరిగి సరైన వివరాలతో పాస్పోర్ట్ జారీ చేస్తున్నాం. దీనికోసం వాళ్లు మళ్లీ స్లాట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం 6 నెలల్లోపే సరైన వివరాలతో పాసుపోర్ట్ జారీ చేస్తు న్నాం. 6 నెలలు దాటితే మళ్లీ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం చిన్నచిన్న ప్రింటింగ్ ఇష్యూలకు మాత్రమే అనుమతిస్తాం. పేరు మార్చడం లాంటివి కుదరదు.
ఇటీవల కొందరు విదేశాల్లో పాస్పోర్ట్లు పోగొట్టుకున్న కేసులు మా దృష్టికి వచ్చాయి. అలాంటి సమయంలో వాళ్లు అక్కడున్న ఇం డియన్ ఎంబసీని ఆశ్రయించాల్సి ఉంటుం ది. వాళ్లు ఒక ఎమర్జెన్సీ సర్టిఫికెట్ జారీ చే స్తారు. కానీ, వాళ్లు అక్కడ ఉండటానికి వీల్లే దు. ఆ సర్టిఫికెట్ కేవలం తిరిగి ఇండియాకు రావడానికే. తొలుత వాళ్లు ఎన్ని రోజుల వరకు అక్కడ ఉండాలనుకుని వెళ్లారో అదం తా కోల్పోయినట్టే. ఇక్కడికి వచ్చాక మళ్లీ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. చా లా మందికి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. పాస్పోర్ట్ పోగొట్టుకున్న రెండు రో జుల్లోనే ఇండియాకు రావాల్సి ఉంటుంది.
హైదరాబాద్ ఒక మినీ ఇండియా. ఇక్కడ అనేక రాష్ర్టాల నుంచి వచ్చినవారు నివాసం ఉంటారు. పాస్పోర్ట్ కోసం దేశంలోని ఏ పాస్పోర్ట్ కార్యాలయంలోనైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇక్కడి చిరునామా ఉంటే పోలీసు విచారణ సులభతరమవుతుంది. కొందరు తమ సొంత రాష్ర్టాల చిరునామాలు పెడుతుంటారు. వారి పోలీస్ ఎం క్వైరీ ఆ రాష్ర్టాల్లో జరిగిన అనంతరం అక్కడి నుంచి పీసీసీ వచ్చాక మిగిలిన ప్రక్రియ పూ ర్తి చేస్తాం. ఇందుకు కొంచం సమయం ఎక్కు వ తీసుకుంటుంది.
చాలా మంది పాస్పోర్ట్ గడువు ముగిసిందని ఆందోళన చెందుతుంటారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక దళారులను ఆశ్రయించి మోసపోతుంటారు. పాస్పోర్ట్ గడువు ముగిస్తే తీసుకోవాల్సిన చర్యలపై ఆర్పీవో కార్యాలయం ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు. పాస్పోర్ట్ నిబంధనల విషయానికొస్తే 18 ఏళ్లు దాటిన వారికి జారీ చేసిన రోజు నుంచి పదేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుంది. తర్వాత దాన్ని పునరుద్ధరించుకోవాలి. పాస్పోర్ట్ గడువు ముగిసిన మూడేళ్ల వరకు లేదా గడువు ముగియడానికి ఏడాది ముందుగా రెన్యూవల్ చేసుకునే వీలుంది. ఆన్లైన్లో రెన్యూవల్ చేసుకోవచ్చు. పాస్పోర్ట్సేవా వెబ్సైట్లోకి వెళ్లి కొత్త వినియోగదారుగా నమోదు కావాలి లేదా ఇదివరకే లాగిన్ ఐడీ ఉంటే దాంతో లాగిన్ కావొచ్చు. పాస్పోర్ట్ రీ ఇష్యూ క్లిక్ చేస్తే మిగిలిన స్టెప్పులన్నీ వస్తాయి. వాటిని సక్రమంగా ఫిల్ చేసి స్లాట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది.
2019-5,32,785
2021-4,28,246
2022-6,43,157
2023- 7.85,485
2024 (ప్రస్తుతం)-3.96లక్షలు
పాస్పోర్ట్ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులెదురైతే మాకు మెయిల్ చేయొచ్చు. మేం పబ్లిక్ గ్రీవెన్సీ సెల్ ఏర్పాటు చేశాం. మెయిల్, ఎక్స్ లో మా టీం అందుబాటులో ఉంటుంది. ప్రతి గురువారం ఉదయం 9:30 నుంచి మధ్యా హ్నం 12:30 గంటల మధ్య నేరుగా ఆర్పీవో కార్యాలయాన్ని సందర్శించొచ్చు. మా మెయిల్ ఐడీ rpo.hyderabad@mea .gov.in మెయిల్ చేయొచ్చు. మా వాట్సాప్ నంబర్ 8121401532. రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మా టీం అందుబాటులో ఉండి దరఖాస్తుదారుల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తాం. పాస్పోర్ట్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. మెయిల్లోనే ఇబ్బందులు తెలియజేయండి. ఎక్స్ తదితర వాటిలో వద్దు.