హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): రామగుండం థర్మల్ పవ ర్ ప్లాంట్ను టీజీ జెన్కో ద్వారానే ని ర్మించాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ (టీజీపీఈ) జేఏసీ కోరింది. జెన్కోకు చెందిన ఈ పవర్ప్లాంట్ను మూసివేసి, 580 ఎకరాల స్థలాన్ని సింగరేణికి అప్పగించి, ఆ సంస్థతో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని జేఏసీ నేతలు కోరారు.
శుక్రవారం జేఏసీ నేత లు విద్యుత్తు సౌధలో టీజీ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ రొనాల్డ్ రాస్ను కలిసి వినతిపత్రం అందజేశారు. వందశాతం ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్కోను ప్రభుత్వం బలోపేతం చేయాలని కోరా రు. కొత్తగా నిర్మించే థర్మల్, జల, సో లార్ విద్యుత్తు ప్రాజెక్టులను జెన్కో ద్వా రానే నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ అంశంపై త్వరలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చిస్తానని సీఎండీ హా మీనిచ్చినట్టు తెలిపారు. వినతిపత్రం ఇ చ్చిన వారిలో జేఏసీ చైర్మన్ సాయిబాబు, వైస్ చైర్మన్లు వజీర్, అనిల్కుమార్, ఏ వెంకట నారాయణరెడ్డి, ఈశ్వర్గౌడ్, నెహ్రూ, సదానందం, ఎన్ సురేశ్ కుమార్, పీవీరావు, వేణుగోపా ల్, కుమారస్వామి, మోజెస్ ఉన్నారు.