Weather Update | హైదరాబాద్ : తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. రోజంతా జల్లులు కురుస్తున్న క్రమంలో హైదారాబాద్ వాతావరణ శాఖ మరోసారి అలర్ట్ చేసింది. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. సముద్ర మట్టానికి 7.6 కి. మీ ఎత్తు వరకు ఆవర్తనం విస్తరించి ఉందని, ఈ ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ముఖ్యంగా జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న- సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 30 నుంచి 40 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇక హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గత 24 గంటల్లో ములుగు జిల్లా తడ్వాయిలో 5.54 సెం.మీ, ఏటూరునాగారంలో 5.49 సెం.మీ, మంగపేటలో 5.28 సెం.మీ, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 5.05 సెం.మీ, అశ్వాపురంలో 4.35 సెం.మీ, బూర్గంపాడులో 4.14 సెం.మీ, పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్లో 4.56సెం.మీ, జయశంకర్భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో 4.08 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
TGPSC | జేఎల్ అభ్యర్థులకు కీలక అప్డేట్.. ఆగస్టు 5 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్
Group-4 | గ్రూప్-4 దివ్యాంగ అభ్యర్థులకు 30 నుంచి వైద్య పరీక్షలు
Srisailam Project | శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద..
Harish Rao | కరెంట్ కోతలపై శాసనసభలో భట్టికి హరీశ్రావు సవాల్.. తోక ముడిచిన రేవంత్ సర్కార్