కాచిగూడ, జూలై 3 : బీసీల సమస్యలు పరిష్కరించకుంటే కేంద్ర ప్రభుత్వంపై సమరశీల పోరాటం చేస్తామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. అహింసా మార్గంలో కేసీఆర్ చేసిన తెలంగాణ ఉద్యమాన్ని చూసి సోనియాగాంధీ భయపడి తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
ఇదే మార్గంలో బీసీలమంతా ఏకమై తమ సమస్యలపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని, వేలాది మందితో పార్లమెంట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీ, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.