భువనగిరి కలెక్టరేట్, జూలై 2 : పట్టభద్రుల ఎమ్మెల్సీ చింతపండు నవీన్కుమార్ (తీన్మార్ మల్లన్న)కు భువనగిరిలో నిరసన సెగ తాకింది. మంగళవారం భువనగిరి జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశానికి ఎమ్మెల్సీ మల్లన్న రాగా, బీజేపీ, బీజేవైఎం శ్రేణులు నిరసన తెలిపాయి.
తహసీల్దార్ కార్యాలయం వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ ధర్నా చేపడుతున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు పక్కనే ఉన్న జడ్పీ కార్యాలయానికి ఎమ్మెల్సీ రావడాన్ని గమనించి ఒక్కసారిగా అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు.