హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఈ వానకాలంలో ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు అగ్నిమాపకశాఖ అధికారులు, సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని ఆ శాఖ డీజీ వై నాగిరెడ్డి ఆదేశించారు. గచ్చిబౌలిలోని అగ్నిభవన్లో శనివారం రాష్ట్రంలోని డీఎఫ్ఓలతో ఆయన సమావేశమయ్యారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిబ్బంది డిప్లాయ్మెంట్పై సమీక్షించారు.
అనంతరం నాగిరెడ్డి మాట్లాడుతూ సిబ్బం ది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రె స్క్యూ సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అగ్నిమాపకశాఖ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, అడిషనల్ డైరెక్టర్ నారాయణరావు, ఆర్ఎఫ్ఓ హరినాథ్రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ సుధాకర్రావు పాల్గొన్నారు.