సిద్దిపేట : సిద్దిపేట(Siddipet) జిల్లా కొండపాక మండలంలోని ఖమ్మంపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను (Double bedroom houses) వెంటనే నిరుపేదలైన లబ్ధిదారులకు ఇవ్వాలని గజ్వేల్ నియోజవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి(Vanteru Pratap Reddy) డిమాండ్ చేశాడు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖత్వపు ఆలోచనలతో, అధికార బలంతో రెవెన్యూ, పోలీస్ సిబ్బందిని అడ్డుపెట్టుకొని 19 నిరుపేద కుటుంబాలను డబుల్ బెడ్రూమ్ల నుంచి గెంటివేసి తాళాలు ఇండ్లకు తాళాలు వేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు.
గురువారం ఖమ్మంపల్లిలోని డబుల్బెడ్రూమ్లను ప్రతాప్రెడ్డి సందర్శించడంతో పాటు బాధితుల కుటుం బాలను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయంలో ఖమ్మం పల్లిలో నిరుపేదల కోసం 60 డబుల్బెడ్రూమ్లు నిర్మాణం చేశారన్నారు. 41 ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించగా మరో 19 ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించే క్రమంలో ఎన్నికల కోడ్రావడంతో మిగత 19 మంది లబ్ధిదారు లకు ఇండ్లను పంపిణీ చేయలేదన్నారు.
కాగా, గ్రామంలో ఎలాంటి ఆస్తిపాస్తులు లేని వారు ఆ ఇండ్లలో నివసిస్తున్నారని దయనీయ పరిస్థితులో ఉన్న వారందరికి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఆర్డీవో మానవతా దృక్పథంతో ఆలోచించి వారికి ఇండ్లను కేటాయిం చాలన్నారు. లబ్ధిదారులకు అన్ని విధాలుగా బీఆర్ఎస్ అండగా ఉంటుందని వారికి పట్టాలు అందించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు నూనె కుమార్యాదవ్, రైతుబంధు మండల మాజీ కో ఆర్డినేటర్ ర్యాగల దుర్గయ్య, నాయకులు జిర్ర రాజు, అహ్మద్, దున్న సాయిలు, కోడెల మల్లేశం, మర్పడగ కనకయ్య, దోమల శ్రీశైలం, అందె యాదగిరి తదితరులు ఉన్నారు.