హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు వ్యవహారాలపై హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఎల్ నరసింహారెడ్డి సారథ్యంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని కూడా ఆయన సవాల్ చేశారు. కమిషన్ విచారణను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కమిషన్ ఏర్పాటు చట్ట వ్యతిరేకమని తుది తీర్పు వెలువరించాలని విజ్ఞప్తిచేశారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణాలు, ఛత్తీస్గఢ్తో ఎంఓయూ, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పైవిచారణకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటుచేయడం చట్ట వ్యతిరేకమని వెల్లడించాలని కోరారు. ఈ వ్యాజ్యంలో విద్యుత్తు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్తోపాటు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని వ్యక్తిగత ప్రతివాదిగా పేరొన్నారు. ఈ పిటిషన్కు హైకోర్టు నంబర్ కేటాయించాల్సి ఉన్నది. కాగా, జస్టిస్ నరసింహారెడ్డిని వ్యక్తిగత ప్రతివాదిగా పేర్కొనడంపై రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి పరిశీలన తర్వాత తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.
విద్యుత్తు చట్టం 2003 ప్రకారం, విద్యుత్తు వ్యవహారాలపై సమీక్ష చేసి నిర్ణయాలు తీసుకొనేందుకు రాష్ట్ర విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్ (ఎస్ఈఆర్సీ)చట్ట ప్రకారం ఏర్పాటైంది. ఎస్ఈఆర్సీ బహిరంగ విచారణలను నిర్వహించి ప్రజాభిప్రాయాలు స్వీకరిస్తుంది. ఎస్ఈఆర్సీ నిర్ణయాలతో విభేదించిన వాళ్లు ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకోవచ్చు. ఈ అప్పిలేట్ అథారిటీలో వాదనలు వీగిపోతే, సుప్రీంను ఆశ్రయించే వెసులుబాటు ఉంది. ఈ తర హా చట్ట నిబంధనలను తుంగలోకి తొకి కమిషన్ ఏర్పాటుచేయడాన్ని చట్ట వ్యతిరేకంగా ప్రకటించాలి.
దక్షిణాది రాష్ట్రాలన్నీ విద్యుత్తు కొరతతో ఉన్నాయి. టీఎస్ ఎస్పీడీసీఎల్ విచారణ జరిపి దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం ఛత్తీస్గఢ్లో మాత్రమే మిగులు విద్యుత్తు ఉన్నదని తేల్చింది. ఫలితంగా ఛత్తీస్గఢ్తో చర్చలు జరిపాం. విద్యుత్తు సరఫరాకు ఛత్తీస్గఢ్ అంగీకరించడంతో మార్వా ప్లాంట్ నుంచి విద్యుత్తు సరఫరాకు 2014లో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పం దం కుదుర్చుకున్నాం. నిజానికి తమిళనాడు యూని ట్ 4.94, కర్ణాటక 4.33కు కొనుగోలు చేస్తుండగా తెలంగాణ మాత్రం 3.90గానే నిర్ణయించింది. మా ర్వా ప్లాంట్ పనులను పరిగణనలోకి తీసుకుని 2015 సెప్టెంబర్లో కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నాం. వీటిని కమిషన్ ఏమాత్రం ప్రస్తావించకుండా మార్వా ప్లాంట్ 2016 మార్చిలో వచ్చిందని, పవర్ ప్లాంట్ లేకుండానే విద్యుత్తు కొనుగోలు ఒప్పందం సరికాదని చెప్పడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
విద్యుత్తు కొనుగోలు వ్యవహారం రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం. ఈ విషయాన్ని కూడా కమిషన్ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనపుడు జాతీయ గ్రిడ్తో అనుసంధానం కాలేదు. దక్షిణాది రాష్ట్రాల్లో అయిదు రాష్ట్రాలు మాత్రమే అనుసంధానమై ఉన్నాయి. తెలంగాణకు గ్రిడ్ సంధాన సౌకర్యం లేకపోవడంతో లైన్ ద్వారా విద్యుత్తు సరఫరాకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (పీజీసీఎల్) అనుమతి తీసుకున్నాం. అంతర్రాష్టాల మధ్య విద్యుత్తు సరఫరా వ్యవస్థ నియంత్రణకే ఈ సంస్థ ఏర్పాటైంది. పీజీసీఐఎల్తో చర్చించి టీఎస్ ఎస్పీడీసీఎల్ ప్రత్యేక కారిడార్ను బుక్ చేసుకున్నాం. భద్రాద్రి ప్రాజెక్టుకు పర్యావరణ చట్టంతోపాటు అన్ని అనుమతులను తీసుకున్నాకే చేపట్టాం.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండుసార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించాను. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రధానంగా విద్యుత్తు సమస్య తీవ్రంగా ఉన్నది. దీనిని పరిషరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. ఉమ్మడి ఏపీలో తీవ్ర విద్యుత్తు కోతలతో ప్రజలు నానా ఇకట్లు పడ్డారు. అప్పుడు వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. ఎంతోమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పరిశ్రమలకు వారానికి రెండు రోజులుపాటు లేఆఫ్ కూడా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్తు కేటాయింపులు సరిగ్గా జరగలేదు. విద్యుత్తు సమస్య జటిలం కాకుండా ఉండేందుకు దీర్ఘకాలిక చర్యలతోపాటు స్వల్పకాలిక చర్యలు తీసుకున్నాం. శాశ్వత పరిషారంగా విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు చట్ట నిబంధనలకు అనుగుణంగా అన్ని సంస్థల అనుమతులతోపాటు ఎస్ఈఆర్సీ అనుమతులు తీసుకున్నాం.
విద్యుత్తు చట్టం 2003 కింద ఏర్పాటైన ఎస్ఈఆర్సీ.. సమగ్ర విచారణ జరిపి ఉత్తర్వులు జారీచేసే న్యాయవ్యవస్థ. దాని పరిధిలో జరగాల్సిన వాటిని ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు ద్వారా చేయడానికి వీల్లేదు. ఎస్ఈఆర్సీ తీసుకునే నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు కూడా చట్టంలో వీలుంది. అది జారీచేసే ఉత్తర్వులను సవాల్ చేసుకోవడానికి అప్పిలేట్ అథారిటీ ఉంది. ఈఆర్సీ జారీచేసిన ఉత్తర్వులకు రక్షణ ఉంది. వీటిని ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు, ట్రిబ్యునల్, కమిషన్, సభ్యులు ఎవరూ ప్రశ్నించడానికి అవకాశం లేదు. కమిషన్ ఏర్పాటుచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేనేలేదు. ఎస్ఈఆర్సీ పరిధిలోని అంశాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే అది నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణలో తెలియజేయవచ్చు. ఈఆర్సీ నిర్ణయంపై అభ్యంతరాలుంటే అప్పిలేట్ ట్రిబ్యునల్, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు మార్గాలు ఉన్నా వాటిని మూసివేసి ప్రభుత్వం ఎంక్వయిరీ కమిషన్ను ఏర్పాటు చేయడం చట్ట వ్యతిరేకం. విద్యుత్తు చట్టంలో ఈ విషయాలు చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ విద్యుత్తు శాఖ ఎంక్వయిరీ కమిషన్ను ఏర్పాటు చేయడం చెల్లదు. విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా, పంపిణీ మొదలైన అన్ని అంశాలను ఎస్ఈఆర్సీ పరిధిలోనే విచారణ చేయాలని సుప్రీంకోర్టు గుజరాత్ ఊర్జా వికాస్ వర్సెస్ ఏఆర్ పవర్ లిమిటెడ్ కేసులో కీలక తీర్పు చెప్పింది.
ఛత్తీస్గఢ్తో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై పలువురితోపాటు అప్పటి తెలంంగాణ టీడీపీ వరింగ్ ప్రెసిడెంట్, ఆ పార్టీ ఎమ్మెల్యే ఏ రేవంత్రెడ్డి కూడా ఎస్ఈఆర్సీలో అభ్యంతరాలు వ్యక్తంచేశారు. అప్పుడు ఎస్ఈఆర్సీ అందరి వాదనలు విన్న తర్వాత ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వులపై నాడు విపక్ష ఎమ్మెల్యేగా ఉన్న నేటి సీఎం రేవంత్రెడ్డి అప్పిలేట్ అథారిటీలో అప్పీల్ చేయలేదు. అయితే, విద్యుత్తు కొనుగోళ్లు, టారిఫ్లకు సంబంధించి డిసం మాత్రం అప్పిలేట్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేసింది. ఇవి పెండింగ్లో ఉన్నాయి. అప్పుడు అప్పీల్ కూడా చేయని రేవంత్రెడ్డి సీఎం అయ్యాక తన అధికారాలను అడ్డం పెట్టుకుని విద్యుత్తు వ్యవహారాలపై విచారణ కమిషన్ను నియమించారు.
చట్టప్రకారం ఎస్ఈఆర్సీ వంటి జ్యుడీషియల సంస్థ విచారించిన వ్యవహారంపై ఏవిధమైన తదుపరి విచారణ అవసరం లేదని చెప్పాల్సిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నన్ను విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీచేశారు. చట్టసభల ఎన్నికల కారణంగా బిజీగా ఉన్నందున కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు గడువు కావాలని కోరాను. ఇదే సమయంలో జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇది తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఎంవోయూ కుదుర్చుకోవడం, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్తు ప్లాంట్లలో సబ్ క్రిటికల్ సాంకేతికతను వినియోగించడం వంటి సరికాదనే అభిప్రాయాన్ని ఆయన వెల్లడించారు. భద్రాద్రి ప్లాంట్లో ఆ విధమైన సాంకేతికత వినియోగం వల్ల రూ.250 కోట్ల నుంచి రూ. 300 కోట్ల వరకు నష్టం జరిగిందని నిర్ధారణకు వచ్చినట్టు జస్టిస్ నరసింహారెడ్డి వెల్లడించడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. పూర్తిస్థాయిలో విచారణ చేయకుండానే ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేసిన కమిషన్.. అది సమర్పించబోయే నివేదిక ఎలా ఉంటుందోననే అనుమానాలు కూడా లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో తాను కమిషన్కు వివరాలను ఇవ్వడం వల్ల ఏవిధమైన ప్రయోజనమూ ఉండదు. మొత్తంగా చూస్తే కమిషన్ విచారణ ప్రక్రియ అంతా ఏకపక్షంగా చట్ట వ్యతిరేకంగా జరుగుతున్నది. నాకు నోటీసు ఇచ్చిన కమిషన్ నా వివరణ లేదా సమాధానం ఏమిటో తెలియకుండానే ఆ విధంగా వెల్లడించడం సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకం అవుతుంది. జస్టిస్ నరసింహారెడ్డి నిష్పాక్షికంగా వ్యవహరించడంలేదు. కమిషన్ ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇవ్వకముందే ముందే జస్టిస్ నరసింహారెడ్డి ఒక నిర్ణయానికి వచ్చేశారు. నేను తప్పు చేసినట్టుగా విలేకరుల సమావేశంలో చెప్పడాన్ని బట్టి చూస్తే విద్యుత్తు వ్యవహారాలపై కమిషన్ విచారణ నామమాత్రమేనని స్పష్టం అవుతున్నది.
థర్మల్ పవర్ ప్లాంట్లు 30 శాతం బొగ్గును ఫ్లైయాష్గా ఉత్పత్తి చేస్తాయి. వీటిని పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా సురక్షితంగా పారవేయాలి. ఫ్లైయాష్ను సిమెంట్ పరిశ్రమలు వినియోగిస్తాయి. అలాంటి అనేక సిమెంట్ ప్లాంట్లు దామరచర్ల చుట్టుపక్కల ఉన్నాయి. వాటికి బూడిద తరలింపు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. చాలావరకు విద్యుత్తు కేంద్రాలు ఉత్తర తెలంగాణలో ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, తీవ్రవాద కార్యకలాపాలు వంటి ఏదైనా అనుకోని సంఘటనలు సంభవించినప్పుడు రాష్ట్రం మొత్తం విద్యుత్తు సరఫరాలో అంతరాయానికి ఆస్కారం ఉంటుంది. అనేక థర్మల్ పవర్ స్టేషన్లు బొగ్గు గనులకు దూరంగా ఉన్నాయి. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్, కృష్ణ్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. యాదాద్రి పవర్ స్టేషన్కు బొగ్గు లింకేజీ లేదు. చాలాకాలం తరువాత కేంద్రం బొగ్గు లింకేజీ ఇచ్చింది. మణుగూరు, దామరచర్లలో థర్మల్ ప్లాంట్ల నిర్మాణ కాంట్రాక్టును బీహెచ్ఈఎల్కు అప్పగించడం విధి విధానాల్లో ఒకటి. తెలంగాణలో కొత్త థర్మల్ ప్లాంట్లు ఏర్పాటుచేసి విద్యుత్తు రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని నిర్ణయించింది.
ఛత్తీస్గఢ్లో మార్వా ప్లాంట్ పనులు పూర్తవుతున్న దశను పరిగణనలోకి తీసుకొని 2015 సెప్టెంబర్లో కొనుగోలు ఒప్పందం చేసుకున్నాం. దీని గురించి పట్టించుకోకుండా మార్వా ప్లాంట్ 2016 మార్చిలో వచ్చిందని, పవర్ ప్లాంట్ లేకుండానే విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకోవడం తప్పని జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. విద్యుత్తు కొనుగోలు ఒప్పందం రెండు ప్రభుత్వాల మధ్య జరిగింది. దక్షిణాదిన ఇంచుమించుగా అన్ని రాష్ట్రాల్లో విద్యుత్తు సమస్యలు ఉన్నాయి. అవి విద్యుత్తు కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో ఛత్తీస్గఢ్తో ప్రభుత్వం ఒప్పందాన్ని చేసుకుంది. గ్రిడ్ సంధాన సౌకర్యం లేకపోవడంతో లైన్ ద్వారా విద్యుత్తు సరఫరాకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పవర్గ్రిడ్ కార్పొరేషన్ (పీజీసీఎల్) పర్మిషన్ ఇచ్చింది. పీజీసీఐఎల్తో చర్చించిన తరువాతనే టీఎస్ ఎస్పీడీసీఎల్ ప్రత్యేక కారిడార్ను బుక్ చేసుకుంది. భద్రాద్రి ప్రాజెక్టు అన్ని అనుమతులతో నిర్మాణం అయింది. ఇలాంటి విషయాలను వదిలేసిన కమిషన్ అసమగ్ర విచారణతో నష్టం జరిగిందంటూ ఒక నిర్ణయానికి వచ్చేసి విలేకరుల సమావేశంలో వెల్లడించడంతో అనేక సందేహాలకు ఆసారం ఏర్పడుతున్నది. కమిషన్ నిష్పాక్షికతపైనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
మణుగూరులో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, దామరచర్లలో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణాలపైన, ఛతీస్గఢ్తో ఎంవోయూ, విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలు (పీపీఏ)లపై విచారణకు మార్చి 14న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిషన్ చట్ట వ్యతిరేకం. కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు. విద్యుత్తు వ్యవహారాలపై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సరైనవో కాదో తేల్చేందుకు కమిషన్ ఏర్పాటు చేయడం చెల్లదు. విచారణ కమిషన్ ఏర్పాటుకు వీలుగా విద్యుత్తు శాఖ జారీచేసిన ఉత్తర్వులు చట్ట వ్యతిరేకమని ప్రకటించాలి. విద్యుత్తు కొనుగోళ్లు, సరఫరా, ఒప్పందాలు, వివాదాలపై విచారించే పరిధి ఎస్ఈఆర్సీకి మాత్రమే ఉన్నది. కమిషన్ ఏర్పాటుచేసే పరిధి, అధికారం ప్రభుత్వానికి లేవు. విద్యుత్తు శాఖ చట్టంలో కూడా ఆ విధమైన వెసులుబాటు లేదు. కాబట్టి కమిషన్ నియామకమే చెల్లదు. ప్రభుత్వం జారీచేసిన జీవో కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్తు చట్టానికి కూడా విరుద్ధం. విద్యుత్తు చట్టంలోని సెక్షన్ 61, 62, 86లకు వ్యతిరేకం. ప్రభుత్వం విచారణకు నిర్దేశించిన అంశాలన్నీ ఎస్ఈఆర్సీ పరిధిలోనే ఉన్నాయి. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు జరిగింది. కమిషన్ విచారణ సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని, చట్టవిరుద్ధమని పేరొంటూ పూర్తి వివరాలతో కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి లేఖ రాయడం జరిగింది. అయినప్పటికీ కమిషన్ చైర్మన్గా జస్టిస్ నరసింహారెడ్డి కొనసాగడం రాజ్యాంగ, చట్టవిరుద్ధం. కమిషన్ ముందు హాజరై ఆధారాలను సమర్పించాలని కోరుతూ ఈ నెల 19న కమిషన్ జారీచేసిన ప్రొసీడింగ్స్, కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్ 1952 నిబంధనలకు విరుద్ధం. కమిషన్ నోటీసు జారీ చేయడాన్ని రద్దు చేయాలి.
ప్రజాహిత వ్యవహారాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ కమిషన్ ఏర్పాటు చేయవచ్చు. విద్యుత్తు వ్యవహారంపై కమిషన్ ఏర్పా టు మాత్రం ఆ విధంగా జరగలేదు. కేవలం గత ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా కమిషన్ ఏర్పాటు జరిగింది. వాస్తవానికి ప్రభుత్వానికి విద్యుత్తు కొనుగోళ్లు, పీపీఏలపై కమిషన్ ఏర్పాటు చేసే అధికారం చట్టంలో లేదు. అయినా లేని అధికారాలను తెచ్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యం లో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్ తన పరిధి దాటి విచారణ పూర్తికాకుండా విచారణలో తెలుసుకున్న అరకొర వివరాలను ఆధారంగా చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చేసి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దీంతో విచారణ కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని స్పష్టం అవుతున్నది. కాబట్టి కమిషన్ జారీచేసిన నోటీసును కూడా రద్దు చేయాలి. కమిషన్ను ఏర్పాటు చేస్తూ వెలువడిన జీవోను సైతం కొట్టివేయాలి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పాలనా పగ్గాలు అందుకున్నాను. ఏనాడూ విద్యుత్తు కొరత అనేది తలెత్తకుండా నిర్ణయాలు తీసుకున్నాను. విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలు చేసుకోవడం ద్వారా పరిశ్రమలకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా చేశాను. గతంలో ఉమ్మడి ఏపీలో పరిశ్రమలు వారంలో రెండు మూడు రోజులు మూతపడే దుస్థితి ఉండేది. రైతులు ఆత్మహత్యలు చేసుకునే ఘటనలు కూడా ఉన్నాయి. వ్యవసాయం చేయడం కష్టతమని భావించే పరిస్థితుల నుంచి పూర్తి సాగుపై రైతులు మకువ చూపేలా చేయడానికి విద్యుత్తు సరఫరా ఎంతగానో దోహదపడింది.