Malavath Purna | హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి చెందిన గిరిజన పుత్రిక మాలావత్ పూర్ణ మరో అరుదైన గౌరవం దక్కింది. ఎయిర్ ఇండియా సంస్థ తన ప్రయాణికుల కోసం అందించే ఇన్ఫ్లైట్ మ్యాగజైన్ ‘నమస్తే ఏఐ’లో చోటు దక్కించుకున్నది.
తన 13 ఏండ్ల వయసులోనే పూర్ణ 2014లో మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించి రికార్డు సృష్టించింది. ఆ తరువాత కూడా పర్వతారోహణ కొనసాగిస్తూ దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. తాజాగా ఎయిర్ ఇండియా ప్రతినెలా తన ప్రయాణికుల కోసం అందిస్తున్న మ్యాగజైన్లో పూర్ణపై ప్రత్యేక కథనం ప్రచురించడం గర్వకారణం.