నారాయణపేట, జూన్ 30: ‘గెలిచినా.. ఓడినా బీఆర్ఎస్తోనే నా ప్రయాణం. ఈ ఆత్మీయ సమ్మేళ నం సాక్షిగా ప్రకటిస్తున్నా. ఎట్టి పరిస్థితిల్లోనూ పార్టీ మారను. కేసీఆర్ వెంటే ఉంటా’ అని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి స్పష్టంచేశారు.
ఆదివారం నారాయణపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్ రాజేందర్రెడ్డి అధ్యక్షతన, మక్తల్లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం సొంత జిల్లాలోనే విజయం సాధించానని, కాంగ్రెస్ నాయకులు పోలీస్స్టేషన్ల రాజకీయాలు మానుకొని అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతలపై మండలిలో తప్పకుం డా ప్రస్తావిస్తానని చెప్పారు.
ప్రభుత్వం జిల్లాలను రద్దు చేయాలని చూస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని, ప్రభుత్వం పెట్టే కేసులకు ఎవరూ భయపడవద్దని సూచించారు. ఎలాంటి హోదా లేకున్నా సీఎం తమ్ముడు కల్యాణలక్ష్మి చెకులు పంపిణీ చేస్తుంటే.. దౌల్తాబాద్ జడ్పీటీసీ మహిపాల్రెడ్డి నిలదీయడం అభినందనీయమని అన్నారు.