Gandhi Hospital | హైదరాబాద్ : నగరంలోని గాంధీ హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. నిరుద్యోగుల సమస్యపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ను పరామర్శించేందుకు విపక్ష నేతలతో పాటు నిరుద్యోగులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో కవరేజ్కు వెళ్లిన మీడియా ప్రతినిధులపై పోలీసులు దౌర్జన్యం చేశారు.
ఓ కెమెరామెన్ పట్ల ఓ ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. కెమెరామెన్ను నెట్టిపడేశాడు. ఓ మహిళా జర్నలిస్టుతో కూడా మరో పోలీసు అధికారి వాగ్వాదానికి దిగారు. దీంతో మీడియా ప్రతినిధులు పోలీసుల తీరుపట్ల తీవ్రంగా మండిపడ్డారు. మీడియాను అడ్డుకోవడం ఏంటని నిలదీశారు. పోలీసుల తీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొత్తంగా గాంధీ ఆస్పత్రి వద్ద స్థానిక పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. గాంధీ ఆస్పత్రిలోకి వెళ్లే ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే హాస్పిటల్లోకి పంపిస్తున్నారు పోలీసులు. మీడియాను మాత్రం హాస్పిటల్లోకి అనుమతించడం లేదు.
గాంధీ హాస్పిటల్ వద్ద నిరుద్యోగుల ఆందోళనను కవర్ చేస్తున్న మీడియాని అడ్డుకుంటున్న పోలీసులు pic.twitter.com/jgegjltY4n
— Telugu Scribe (@TeluguScribe) July 1, 2024