హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ ఆదేశాల మేరకు తమిళనాడులో రవాణాశాఖపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర రవాణాశాఖ అధికారుల బృందం రెండు రోజుల పర్యటన చేపట్టింది.
ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్, వాహన్ పోర్టల్, స్క్రాపింగ్ పాలసీ, పన్నులు, ఆదాయం, చెక్పోస్టులు, ఆన్లైన్ సర్వీసుల గురించి అధ్యయనం చేశారు. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్గౌడ్, ఉప్పల్ ఆర్టీవో వాణి, కామారెడ్డి ఎంవీఐ శ్రీనివాస్ తమిళనాడు రవాణా శాఖ కమిషనర్ షణ్ముగసుందరంతో భేటీ అయ్యా రు.
ఇప్పటికే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళలో నాలుగు బృందాలు పర్యటించి ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేశాయి. వీరికి తోడుగా తమిళనాడు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేశ్, ఆర్టీవో సంపత్కుమార్, ఎంవీఐ కార్తీక్ను తమిళనాడు రవాణాశాఖ నియమించింది. త్వరలో కమిషనర్కు అధ్యయన నివేదిక సమర్పించనున్నట్లు చంద్రశేఖర్గౌడ్ తెలిపారు.