హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): పీఈటీ పోస్టుల భర్తీకి రెండో విడుత సర్టిఫికెట్ వెరిఫికేషన్ను నేటి నుంచి 11 వరకు నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు. ఈ మేరకు బుధవారం వెబ్నోట్ విడుదల చేశారు. 1:4 నిష్పత్తి ప్రకారం 1073 మంది అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్కు ఎంపిక చేశామని, జాబితాను వెబ్సైట్లో అప్లోడ్ చేశామని వెల్లడించారు.
కాగా, ఈ ఏడాది మే 24న పీఈటీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు చాలామంది అభ్యర్థులు హాజరుకాలేదు. హాజరు కాని అభ్యర్థులకు మరొక అవకాశం ఇవ్వడానికి రెండో విడుత సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెబ్నోట్లో పేర్కొన్నారు. ఐదు గురుకులాల్లో ఖాళీగా ఉన్న 616 పీఈటీ పోస్టుల భర్తీకి 14 ఏప్రిల్ 2017లో నోటిఫికేషన్ విడుదల చేశారు. 2017 సెప్టెంబర్ 17, 18న రాత పరీక్ష నిర్వహించారు.