వరంగల్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పనితీరుపై సొంతపార్టీ నేతలకు నమ్మకం లేదని, ఆయన విధానాలపై పలువురు అసంతృప్తితో ఉన్నారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) అన్నారు. ఆదివారం ఆయన వరంగల్ బీఆర్ఎస్ భవన్లో మీడియా సమావే శం లో మాట్లాడాడు. సీఎం అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలతో విసుగు చెందిన సొంత ఎమ్మెల్యేలే (Congress MLAs) ఆయన విధానాలను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి సీఎం కావడం మెజారిటీ ఎమ్మెల్యేలకు ఇష్టం లేదన్నారు.
రోజురోజుకు రేవంత్ పార్టీలో అసమ్మతి గళం పెరుగుతుందన్నారు. అందుకు నిదర్శనమే నిన్న వరంగల్లో ఎదురైన సంఘటన అని గుర్తు చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్బాబుకు మాత్రమే సీఎం ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగిలిన మంత్రులపై నమ్మకం లేదా అని ప్రశ్నించారు. సీఎం తన వర్గాన్ని పెంచు కోవడం కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. పాలన గాలికి వదిలే సి పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుండటంతో రాష్ట్రంలో క్రైం రేటు పెరిగిందన్నారు. గంటకో హత్య జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని విమర్శించారు.