హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): జనసేన అధినేత పవన్కల్యాణ్ ఏపీ ఉపముఖ్యమంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు దస్త్రాలపై సంతకాలు చేశారు. ఇటీవల మంత్రిగా ప్రమాణం చేసిన సమయంలో సినీ నటుడు చిరంజీవి భార్య, పవన్కు వదిన సురేఖ ఓ ఖరీదైన పెన్నును కానుకగా ఇచ్చారు. ఆ పెన్నుతోనే పవన్కల్యాణ్ సంతకాలు చేశారు. పలువురు మంత్రులు కలిసి అభినందనలు తెలిపారు. ఈనెల 24న సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం నిర్వహించనుంది.