హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ చర్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీనేత కేఆర్ సురేశ్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలోని ఎంపీలు తమ ప్రమాణ స్వీకారం సందర్భంగా చేతుల్లో రాజ్యాంగ ప్రతులు పట్టుకొని రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామనే హామీ ఇవ్వ డం సంతోషమేనని, కానీ తెలంగాణలో మాత్రం అం దుకు విరుద్ధంగా జరుగుతున్నదని మండిపడ్డారు. గురువారం ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, పార్ధసారథిరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టానికి చర మగీతం పాడారా? అని ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య అసమానతల వల్లే ప్రాంతీ య పార్టీలు ఉద్భవించాయని కానీ, కాంగ్రెస్, బీజేపీ రెండూ ప్రాం తీయ పార్టీల ఉనికే లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రజ ల గొంతుకగా బీఆర్ఎస్ నిలబడిందని, ఆ గొంతునే లేకుండా చేసే కుటిల యత్నాలను నిలువరిస్తామని తెలిపారు.
ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రపతి ప్రసంగం ఉందని సురేశ్రెడ్డి విమర్శించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఫెడరల్ స్ఫూర్తిని ప్రతిబింబించే తీర్పు ఇచ్చారని, అందులో భాగంగానే సంకీర్ణ ప్రభు త్వం, సంకీర్ణ ప్రతిపక్షం ఏర్పడ్డాయని చెప్పారు. దేశ ప్రజల అభీష్టాన్ని రాష్ట్రపతి ప్రసంగం ప్రతిఫలించలేదని అభిప్రాయపడ్డారు. ప్రసంగంలో కొత్తదనమేమీ లేదని విమర్శించారు. 2022 కల్లా దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గత ఎన్డీయే ప్రభు త్వం ప్రకటించిందని, ఇప్పుడు కూడా అదే వాగ్దానాన్ని నిర్దేశిత కాలపరిమితి లేకుండా ఇచ్చిందని దుయ్యబట్టారు. కేంద్రం సహకార సమాఖ్యస్ఫూర్తి (కో-ఆపరేటివ్ ఫెడరలిజం)కి బదులుగా కాంపిటీటివ్ ఫెడరలిజాన్ని తెస్తామని హాస్యాస్పదమని విమర్శించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ వ్యవసాయం, ఐటీ, నీటిపారుదల, పర్యావరణం, ఫార్మా సహా అనేక రంగాల్లో ఆదర్శంగా నిలిచిందని, అనేక రంగాల్లో దేశ ప్రతిష్ఠను తెలంగాణ ఇనుమడింపచేసిందని పేర్కొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శమని పార్లమెంటు సాక్షిగా కీర్తించినప్పటికీ నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. భారత్ విశ్వబంధు అయితే, కేసీఆర్ హయాంలో తెలంగాణ దేశబంధుగా అవతరించిందని పేర్కొన్నారు.
సింగరేణిని ప్రైవేట్పరం కానివ్వబోమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉపనేత వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక చర్యలను ఎండగడతామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలును ఆపాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి సాగునీటి పథకానికి జాతీయ హోదా కల్పించాలని పదేండ్లుగా కోరుతున్నా పట్టించుకోలేదని, ఇప్పుడైనా అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం కుట్రపూరితంగా రెండు కోల్బ్లాక్లను ప్రైవేట్పరం చేసినప్పటికీ సదరు సంస్థ కార్యకలాపాలు కొనసాగకుండా కేసీఆర్ అడ్డుకున్నారని గుర్తుచేశారు.