Smart City | వరంగల్, జూన్ 26 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : చారిత్రక వరంగల్ నగరంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన స్మార్ట్ సిటీ పథకం భవిత వ్యం గందరగోళంలో పడింది. ఈనెల 30తో స్మార్ట్ సిటీ పథకం అమలు గడువు ముగియనున్నది. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ పనులు, నిధుల మంజూరు గడువును పొడిగిస్తుందా? లేదా అనే దానిపై అనుమానాలు నెలకొన్నాయి. స్మార్ట్సిటీ కింద గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో రూ.948 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు చేశారు. ఇప్పటివరకు వరంగల్ నగరానికి రూ.528 కోట్లు విడుదల చేయగా, రూ.505 కోట్లు ఖర్చు చేసింది. మరో రూ.23 కోట్లు నిల్వ ఉన్నాయి. వా రం రోజులక్రితం కేంద్రం రూ.56 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా గా మరో రూ.56 కోట్లు విడుదల చేస్తే రూ.112 కోట్లు గ్రేటర్ ఖజానాకు చేరుతాయి. పనులు అసంపూర్తిగా ఉండటంతో స్మార్ట్సిటీ పథకం గడువును మరో ఏడాది పొడిగించాలని కోరు తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కేంద్రం తీసుకునే నిర్ణయంపైనే వరంగల్ స్మార్ట్సిటీ పథకం భవితవ్యం ఆధారపడి ఉన్నది.
చిరుతను తప్పించబోయి కారు బోల్తా
ఖలీల్వాడి(మోపాల్), జూన్ 26: చిరుతను తప్పించబోయి కారు బోల్తా పడిన ఘటనలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. కామారెడ్డి జిల్లా యాచారం గ్రామానికి చెందిన మాలోత్ ప్రభాకర్, లలిత (32) దంపతులు. తన భార్యకు ఆరో గ్యం బాగాలేకపోవడంతో ప్రభాకర్ మం గళవారం సాయంత్రం కారులో నిజామాబాద్లోని ప్రైవేట్ దవాఖానకు బయల్దేరాడు. వైద్య పరీక్షల అనంతరం దంపతులు అర్ధరాత్రి వేళ తిరుగు ప్రయాణమయ్యారు. మోపా ల్ మండలం మంచిప్ప -అమ్రాబాద్ అటవీ ప్రాంతంలోకి రాగా నే చిరుత కనిపించింది. దాన్ని తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పెద్ద బండరాయిని ఢీకొట్టి బోల్తా పడింది. లలి త అక్కడికక్కడే మృతిచెందగా, ప్రభాకర్ తీవ్రం గా గాయపడ్డాడు. సమాచారం అం దుకున్న బంధువులు హుటాహుటిన అక్కడికి చేరుకు ని ప్రభాకర్ను నిజామాబాద్లోని ప్రైవేట్ దవాఖానకు, లలిత మృతదేహాన్ని ప్రభు త్వ దవాఖానకు తరలించా రు. ప్రభాకర్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై గంగాధర్ తెలిపారు.