హైదరాబాద్: కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి అని మరోసారి తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. రుణమాఫీ అయిన రైతులకన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అని చెప్పారు. రుణమాఫీ ఎందుకు కాలేదో చెప్పేటోడు లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను రేవంత్ సర్కార్ మోసం చేస్తున్నదంటూ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు.
ట్వీట్ ఇలా..
‘రుణమాఫీ అయిన రైతులకన్నా..
కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ
అన్నివిధాలా అర్హత ఉన్నా..
ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పెటోడు లేడు…
రెండు సీజన్లు అయినా..
రైతుభరోసా ఇంకా షురూ చెయ్యలే
జూన్ లో వేయాల్సిన రైతుభరోసా..
ఆగష్టు దాటుతున్నా రైతుల ఖాతాలో వెయ్యలే..!!
కౌలు రైతులకు..
ఇస్తానన్న రూ.15 వేలు ఇయ్యనే ఇయ్యలే..!!
రైతు కూలీలకు..
రూ.12 వేల హామీ ఇంకా అమలు చెయ్యలే..!!
కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి అని మరోసారి తేలిపోయింది’
రుణమాఫీ అయిన రైతులకన్నా..
కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ
అన్నివిధాలా అర్హత ఉన్నా..
ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పెటోడు లేడు…రెండు సీజన్లు అయినా..
రైతుభరోసా ఇంకా షురూ చెయ్యలేజూన్ లో వేయాల్సిన రైతుభరోసా..
ఆగష్టు దాటుతున్నా రైతుల ఖాతాలో వెయ్యలే..!!కౌలు రైతులకు..
ఇస్తానన్న… pic.twitter.com/9lmuLQaAKk— KTR (@KTRBRS) August 26, 2024