హైదరాబాద్, జూన్15 (నమస్తే తెలంగాణ): మెడికల్ అడ్మిషన్ల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఎన్ఎస్యూఐ కార్యకర్తలు శనివారం మెరుపు ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న బీజేపీ నేతలు భారీగా అక్కడికి చేరుకొని ఎన్ఎస్యూఐ కార్యకర్తలు, కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్రెడ్డి డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎన్ఎస్యూఐ, కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి అకడి నుంచి తరలించారు.