వరంగల్, జూలై 2: బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయానికి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. బాలసముద్రంలోని సర్వే నంబర్ 1066లో బీఆర్ఎస్ కార్యాలయం కోసం ఎకరం భూమి కేటాయింపు, భవన నిర్మాణం అక్రమమని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి.. కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ విచారణ జరపాలని హనుమకొండ ఆర్డీవో, తహసీల్దార్తోపాటు గ్రేటర్ కమిషనర్కు ఆదేశాలు ఇచ్చారు.
ఈ మేరకు కాజీపేట సర్కిల్-2 డిప్యూటీ కమిషనర్ రవీందర్ బీఆర్ఎస్ కార్యాలయానికి నోటీసులు జారీ చేశారు. సర్వే నంబర్ 1066లో ఎకరం భూమి కేటాయింపు డాక్యుమెంట్లతోపాటు భవన నిర్మాణ అనుమతుల ప్రొసీడింగ్ కాపీలను మూడు రోజుల్లో సమర్పించాలని పేర్కొన్నారు.