హైదరాబాద్, జూలై 4(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని, చిన్నారులు, మహిళలపై లైంగికదాడులు పెరుగుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని నేరెడ్మెట్, ఎల్బీనగర్, బండ్లగూడ, కూకట్పల్లి, మియాపూర్లో ఇటీవల వరుసగా జరిగిన ఘటనలు మహిళలకు రక్షణ లేని పరిస్థితికి నిదర్శనమని పేర్కొన్నారు.
వరుస ఘోరాలు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పందించే తీరికలేదా? మహిళలు అంటే ఇంత చిన్న చూపా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళలపై జరుగుతున్న లైంగికదాడులపై ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.