Hyderabad | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పోరాటం కొనసాగుతూనే ఉంది. నిరుద్యోగుల పోరాటం పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి దిల్సుఖ్నగర్ మెట్రో వరకు పోలీసులు భారీగా మోహరించారు. మెట్రో స్టేషన్ల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మెట్రోలో ప్రయాణించేందుకు వెళ్తున్న ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తున్నారు.
ఒక వేళ నిరుద్యోగిగా అనుమానం వస్తే వారిని మెట్రోలో ప్రయాణించేందుకు అనుమతించడం లేదు. నిరుద్యోగుల ఫోన్లను తనిఖీ చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ఎలాంటి నిరుద్యోగుల గ్రూపులు లేకపోతేనే వారిని మెట్రోలో ప్రయాణించేందుకు అనుమతిస్తున్నారు. టీజీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో నిరుద్యోగులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై నిరుద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల వైఖరిపై మండిపడుతున్నారు.
గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలి.
గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కలపాలి.
జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి
25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి.
నిరుద్యోగులకు మెట్రోలోకి నో ఎంట్రీ!
పోలీసు పహారా మధ్య దిల్సుఖ్నగర్ మెట్రో
నిరుద్యోగుల TGSPSC ముట్టడి నేపథ్యంలో దిల్సుఖ్నగర్ మెట్రో లోకి అనుమతించని పోలీసులు.
ప్రతి ఒక్కరి ఫోన్లో వాట్సప్ ఓపెన్ చేసి చెక్ చేస్తున్న పోలీసులు. pic.twitter.com/TZYBya7fYA
— Telugu Scribe (@TeluguScribe) July 5, 2024