ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నిజాంసాగర్ కాలువ (Nizam Sagar Canal) తెగిపోయింది. సోమవారం తెల్లవారుజామున పట్టణ కేంద్రంలో నిజాంసాగర్ ప్రధాన కాలువ కట్ట తెగిపోయింది. దీంతో కాలువను ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీలోకి నీరు వచ్చిచేరింది. మధ్యరాత్రి వేళ ఒక్కసారిగి నీరు ఇండ్లలోకి రావడంతో కాలనీవాసులు పరుగులు పెట్టారు. నీటి ప్రవాహానికి విద్యుత్ స్తంభాలు కింద పడిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే కాలువ తెగిపోవడానికి ఇరిగేషన్ అధికారుల నిరక్ష్యమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా చెరువులకు నీటిని వదిలే సమయంలో.. నీటిపారుదల అధికారులు కాలువను శుభ్రం చేయాల్సి ఉంది. అయితే ఆర్మూర్ ప్రాంతంలోని అధికారులు అవేవీ పట్టించుకోలేదు. దీంతో ప్రధాన కాలువ మురికి కూపంలో తయారై చెత్తా చెదారంతో నిండిపోయింది. కాగా, ప్రజలకు తాగురు, రైతులకు సాగునీటి కోసం ప్రాజెక్టు అధికారులు కాలువలోకి నీటిని వదిలారు. నిర్వహణ సరిగా లేకపోవడంతో కాలువ తెగిపోయిందని చెప్పారు.
తెగిన నిజాంసాగర్ కెనాల్ కట్ట..
తెల్లవారుజామున నిజాంసాగర్ కెనాల్ కట్ట తెగటంతో నిజామాబాద్ ఆర్మూర్లోని జర్నలిస్ట్ కాలానిలోకి వచ్చిన నీరు, ఇళ్ల నుంచి బయటకి వచ్చిన కాలనీ వాసులు. అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటున్న స్థానికులు.
తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కాలనీ వాసుల డిమాండ్. pic.twitter.com/iFYS7fyzzB
— Telugu Scribe (@TeluguScribe) April 1, 2024