UGC NET | న్యూఢిల్లీ: పేపర్ లీక్ నేపథ్యంలో రద్దయిన యూజీసీ నెట్ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కొత్త తేదీలను ప్రకటించింది. ఆగస్టు 21-సెప్టెంబర్ 4 మధ్య పరీక్ష నిర్వహించనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈసారి ఆన్లైన్ మాధ్యమంలో పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపింది.
వాస్తవానికి ఈ నెల 18న ఈ పరీక్ష నిర్వహించినప్పటికీ, పేపర్ లీక్ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, సీఎస్ఐఆర్ నెట్ పరీక్షను జూలై 25-27 మధ్య నిర్వహించనున్నట్టు ఎన్టీఏ తెలిపింది. ఆలిండియా ఆయుష్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ను ముందుగా నిర్ణయించిన ప్రకారం వచ్చే నెల 6నే పరీక్ష నిర్వహించనున్నట్టు వివరించింది.
న్యూఢిల్లీ, జూన్ 28: ఉద్యోగుల పనితీరుపై తరచుగా సమీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖలకు స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, చట్టబద్ధ సంస్థలు, స్వయం ప్రతిపత్తితో కొనసాగుతున్న సంస్థల పరిధిలోని ఉద్యోగుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా సరిగా పనిచేయని ఉద్యోగులను ముందస్తు రిటైర్మెంట్తో ఇండ్లకు పంపేలా చూడాలని కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ (డీవోపీటీ) అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులను ఆదేశించింది.
ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును కాలానుగుణంగా సమీక్షించి వారిని ఉద్యోగాల్లో కొనసాగించాలో లేక ప్రజాప్రయోజనాల రీత్యా ముందుగానే రిటైర్మెంట్ ఇవ్వాలో నివేదించాలని పదే పదే స్పష్టం చేస్తున్నప్పటికీ పలు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.