ముషీరాబాద్, జూలై 4: ఎస్సీ వర్గీకరణపై నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 7న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ఎస్సీ వర్గీకరణ దీక్ష చేపట్టనున్నట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు. దీక్ష విజయవంతం కోరుతూ రూపొందించిన పోస్టర్ను గురువారం విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. అనంతరం వంగపల్లి మీడియాతో మాట్లాడారు.
దీక్షకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. మాదిగల పట్ల ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఓట్ల కోసం వాడుకొని మాదిగలు, ఉపకులాలను మోసం చేస్తుందని మండిపడ్డారు.
లాయర్ల బీమా 6 లక్షలకు పెంపు
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలోని న్యాయవాదుల జీవిత బీమాను రూ.4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచినట్లు రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి తెలిపారు. ఏప్రిల్ 6న కౌన్సిల్ సమావేశంలో అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్లోని సెక్షన్-16(2) ప్రకారం బీమా పెంపునకు నిర్ణయం తీసుకున్నట్లు గురువారం ఆయన వెల్లడించారు. జూలై 1 నుంచి పెంపు అమల్లోకి వస్తుందని చెప్పారు.