హైదరాబాద్, ఆగస్టు24 (నమస్తే తెలంగాణ) : మున్నూరుకాపులంతా రాజకీయాలకతీతంగా ఐకమత్యంతో హక్కులు సాధించుకోవాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. మున్నూరుకాపు సంఘం అపెక్స్ కౌన్సిల్ సమావేశం శనివారం నగరంలోని రాజరాజేశ్వరి గార్డెన్స్ హాల్లో కౌన్సిల్ కన్వీనర్ పుటం పురుషోత్తమరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న తమ కులానికి మంత్రివర్గంలో చోటులేకపోవడం విచారకరమన్నారు.
త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో మున్నూరుకాపులకు అవకాశం ఇవ్వాలని కోరారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అపెక్స్ కౌన్సిల్ గౌరవ చైర్మన్గా కొనసాగేందుకు అంగీకరించిన బీజేపీకి, కార్పొరేషన్ ఏర్పాటుచేసి రూ.50కోట్లు కేటాయించిన సీఎం రేవంత్రెడ్డికి అపెక్స్ కౌన్సిల్ కృతజ్ఞతలు తెలిపింది.
కేంద్ర మాజీ మంత్రి పుంజాల శివశంకర్ విగ్రహాన్ని నగరంలో ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో ప్రభు త్వ విప్, అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ ఆది శ్రీనివాస్, పురుషోత్తమరావు, బాలకిషన్, శ్రీరామ్చక్రవర్తి, కౌన్సిల్ కోర్కమిటీ సభ్యులు పాల్గొన్నారు.