హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్లోని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది.
గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో అత్యధికంగా 10.49 సెం.మీ, కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలంలో 9.89 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.