MLC Jeevan Reddy | జగిత్యాల, జూలై 4 : జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోత్రాలకాలనీ 8వ వార్డులో గురువారం జరిగిన పోచమ్మ, దుర్గమ్మ బోనాల పండుగలో ఫ్లెక్సీల రగడ నెలకొన్న ది. బోనాల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమా ర్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో మున్సిపాలిటీలో పనిచేసే వారి ఫొటో ఉండటంతో వార్డు కౌన్సిలర్, నాయకులు మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి ఫ్లెక్సీలో మున్సిపాలిటీలో పనిచేసే వారి ఫొటో ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు.
ఉత్సవాలకు హాజరై తిరిగి వెళ్తున్న ఎమ్మెల్సీ జీవన్రెడ్డి.. మున్సిపల్ అధికారులు ఆ ఫ్లెక్సీ ని తొలగిస్తున్న సిబ్బందిని చూసి, ఎందుకు తొలగిస్తున్నారు? అని అడిగారు. మున్సిపాలిటీలో పనిచేసే వారి ఫొటో ఉండటంతో ఫ్లెక్సీ తొలగిస్తున్నామని చెప్పడంతో జీవన్రెడ్డి మున్సిపల్ అధికారికి ఫోన్ చేసి ‘జగిత్యాలలో ఉండనిస్తారా? ఊరి నుంచి వెళ్లగొడతారా? అంటూ మండిపడ్డారు. కలెక్టర్కు, మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్కు జీవన్రెడ్డి ఫిర్యాదు చేశారు. స్థానిక నాయకుల మధ్య రగడ ఎటువైపు దారితీస్తుందోనని చర్చించుకుంటున్నారు.