హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షునిగా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ను అధిష్ఠానం ఖరారు చేసినట్టు సమాచారం. పార్టీ పెద్దల నుంచి సమాచారం అందుకున్న మహేశ్కుమార్ మంగళవారం ఢిల్లీ వెళ్లి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిసి ధన్యవాదాలు తెలిపినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. సీఎం రేవంత్రెడ్డి దక్షిణ తెలంగాణకు చెందినవాడు కావడంతో.. పీసీసీ అధ్యక్ష పీఠాన్ని ఉత్తర తెలంగాణకు చెందిన వ్యక్తికి ఇవ్వడానికి అధిష్ఠా నం మొగ్గుచూపినట్టు తెలిసింది.
మహేశ్కుమార్గౌడ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లావాసి కావడం గమనార్హం. సీఎం రేవంత్రెడ్డి ఓసీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎస్సీకి చెందినవారు కావడంతో పీసీసీ అధ్యక్షుడిని బీసీ నుంచి ఎంపిక చేయాలని అధిష్ఠానం భావించడం కూడా మహేశ్కుమార్గౌడ్కు కలిసివచ్చింది. పీసీసీ కోసం మాజీ ఎంపీ మధుయా ష్కీ, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ చివరి దాకా ప్రయత్నించినప్పటికీ వీరిద్దరూ దక్షిణ తెలంగాణవారు కావడంతోపాటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల వీరి అభ్యర్తిత్వాలను తిరస్కరించినట్టు తెలిసింది.