హైదరాబాద్ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై(Kishan Reddy) ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva Rao) ఫైర్ అయ్యారు. అబద్ధాలు చెప్పడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కిషన్ రెడ్డి మించిపో యారని విమర్శించారు. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ మహాసభలకు హాజరై మా ట్లాడారు. సింగరేణిని(Singareni) బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ఎంఎండీఆర్ పేరుతో చట్టం ఏర్పాటు చేసి ఆ గనులను ప్రైవేట్ సంస్థలకు విక్రయిస్తున్నా రన్నారు. తెలంగాణలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న సింగరేణి బ్లాకులను వేలం వేయడ మంటే ఆ సంస్థకు ఉరివేసినట్లేనని తెలిపారు.
ఒరిడిషా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బొగ్గు గనులను ప్రభుత్వానికి ఇచ్చారని గుర్తుచేశారు. కిషన్ రెడ్డి మోదీతో మాట్లాడి తెలంగాణలో ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న గనులను ప్రభుత్వానికి ఇప్పించేలా కృషి చేయాలని డిమాండ్. సింగరేణిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సందర్భంలో దూకుడుగా ఉండాలన్నారు. సింగరేణి వేలాన్ని నిరిసిస్తూ వచ్చే నెల 5 వ తేదీన కోల్డ్ బెల్ట్ని బంద్ చేసి, కలెక్టరేట్లను ముట్టడి చేస్తామని హెచ్చరించారు. సింగరేణి ప్రైవేటీకరణ తెలంగాణ ప్రజలు అడ్డుకోవాలన్నారు.