సూర్యాపేట : పట్టభద్రులు తమ విలువైన ఓటుని వినియోగించుకోవాలి. మంచి అభ్యర్థిని ఎన్నుకొని చైత న్యాన్ని నిరూపించాలని సూర్యాపేట(Suryapet) శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల(MLC election) ప్రచారం చివరి రోజున శనివారం ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులను కలిసి ఓట్లను అభ్యర్థిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యలపై కొట్లాడే విద్యావంతుడు రాకేష్ రెడ్డి గెలుపు ఖాయం అన్నారు.
ఉద్యోగాలు ఇచ్చామన్న కాంగ్రెస్ మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో చూపించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలిచ్చామని నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నా రని మండిపడ్డారు. 90 శాతం దొడ్డు వడ్లు పండుతుంటే సన్న వడ్లకే బోనస్ అంటున్నారని విమర్శించారు. సన్న వడ్లుకు బయట బోనస్ కంటే ఎక్కువ ధర పలుకుతుంటే ప్రభుత్వానికి ఎలా అమ్ముతారని ప్రశ్నిం చారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ మాయమాటలు నమ్మారు గాని ఇప్పుడు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదన్నారు.