హైదరాబాద్, జులై 2(నమస్తే తెలంగాణ): ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచుకుల పాడు గ్రామ పంచాయతీలను భద్రాచలంలో కలిపేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
6వ తేదీన ఏపీ సీఎంతో రేవంత్రెడ్డి భేటీ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విలీన గ్రామాల సమస్యను ప్రస్తావిస్తూ రేవంత్రెడ్డికి తుమ్మల లేఖ రాశారు. భద్రాచలం రామాలయం దేవస్థానం భూములు పురుషోత్తమపట్నం గ్రామంలో ఉండటంతో ఆ భూములపై పర్యవేక్షణకు ఇబ్బందులు ఎదురవుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు.