హైదరాబాద్ : త్వరలో మండలాల వారీగా జాబ్మేళాలను ఏర్పాటు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హుస్నాబాద్లో(Husnabad) నిర్వహిస్తున్న జాబ్ మేళా(Job Mela) కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..జీరో నుంచి పీజీ వరకు హుస్నాబాద్ నియోజవర్గం నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారు 6 వేల మంది ఉన్నారు. మీకు ఉన్న నైపుణ్యంతో కావాల్సిన ఉద్యోగంతో ఇక్కడి నుంచి వెళ్లాలన్నారు.
ఇవే కాకుండా విదేశాల్లో కూడా నర్సింగ్చ నిర్మాణ రంగం, ఇతర రంగాల్లో లక్షల్లో జీతాలు వచ్చే ఉద్యోగాలు అలాంటి అవకాశాలను కూడా అందిపుచ్చుకోవాలని సూచించారు. అలాగే మండలాల వారీగా ఇలాంటివి ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంతాల వారికి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ఇవే కాకుండా పాల ఉత్పత్తి, చేపల పెంపకం, గ్రామీణ పరిశ్రమలు కల్పించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్ట్ను పూర్తి చేసి టూరిజం స్పాట్గా అభివృద్ధి చేస్తామన్నారు.