నల్లగొండ : నల్లగొండ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy )అన్నారు. సోమవారం నల్లగొండ(Nallgonda) పట్టణంలోని బీట్ మార్కెట్ వద్ద మూ డు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 33/11 కె ఓ సబ్ స్టేషన్(Sub-station) పనులకు శంకుస్థా పన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సబ్ స్టేషన్ నిర్మాణంతో వోల్టేజీ సమస్యను అధిగ మించ వచ్చని తెలిపారు. రెండు నెలల్లో సబ్ స్టేషన్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్, ఇంజినీర్లను మంత్రి ఆదేశంచారు.
నాణ్యమైన కేబుల్తో పాటు, ఫెన్సింగ్ వేయాలని, 24 గంటలు సెక్యూరిటీ గార్డెన్ ఏర్పాటు చేయాలన్నారు. రాబోయే రోజుల్లో ఇబ్బందులు లేకుండా మరో మూడు సబ్ స్టేషన్లు సిద్ధం చేయాలని విద్యుత్ శాఖ అధికా రులనుఆదేశించారు. నల్లగొండ పట్టణంలో తాగునీటి సమస్యను అధికమించేందుకు 10 ఎంఎడీ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి రూ.30 కోట్ల మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని అధికా రులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ట్రాన్స్కో ఎస్ఈ చంద్రమోహన్, ఆర్డీవో రవి, తదితరులు ఉన్నారు.