హైదరాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ): ఏపీ సీఎం చంద్రబాబు, టీజీ సీఎం రేవంత్రెడ్డి మధ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో ఉ మ్మడి రాజధానిగా పదేళ్లపాటు ఏపీ ఆధీనంలో ఉన్న హైదరాబాద్ ఆర్అండ్బీ శాఖ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో సమీక్షా సమావేశం లో మాట్లాడారు.
ఆర్అండ్బీకి చెందిన లేక్ వ్యూ గెస్ట్హౌస్, మినిస్టర్స్ క్వార్టర్స్, ఆదర్శనగ ర్, బషీర్బాగ్, కుందన్బాగ్, ఎమ్మెల్యే క్వార్ట ర్లు, గ్రీన్ లాండ్స్ గెస్ట్హౌస్, మంజీరా అతిథిగృహం తదితర వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సమాచారాన్ని సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్అండ్బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, సంయుక్త కార్యదర్శి హరీశ్, ఈఎన్సీ గణపతిరెడ్డి పాల్గొన్నారు.